ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పెళ్లికి నలుగురే అతిథులు!

ABN, First Publish Date - 2020-04-06T21:03:07+05:30

సాధారణంగా పెళ్లంటే బోల్డంత హంగామా ఉంటుంది. బాజాలు, భజంత్రీలు, బంధుమిత్రుల హంగామా, డీజే.. పెళ్లిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొహాలి: సాధారణంగా పెళ్లంటే బోల్డంత హంగామా ఉంటుంది. బాజాలు, భజంత్రీలు, బంధుమిత్రుల హంగామా, డీజే.. పెళ్లిలో ఇదంతా సర్వసాధారణమైన విషయం. కానీ కరోనా వైరస్ పుణ్యమా అని పంజాబ్‌లోని మొహాలీలో ఓ పెళ్లి అత్యంత సాధారణంగా జరిగింది. నలుగురంటే నలుగురే ఈ పెళ్లికి హాజరయ్యారు. అది కూడా వధూవరుల తరపువారే. అదొక్కటే కాదు మరో విశేషం కూడా ఉందీ పెళ్లిలో. పెళ్లికుమార్తె మెడలో వరుడు తాళి కట్టడానికి ముందు అతడిని పూర్తిగా శానిటైజ్ చేశారు. 


మొహాలీలోని దవాన్ గ్రామంలో జరిగిందీ నిరాడంబర కరోనా వివాహం. వధువు గగన్‌దీప్ కౌర్, ఖన్నా గ్రామానికి చెందిన వరుడు రాజ్‌దీప్ సింగ్‌తో మెడలో తాళికట్టించుకుంది. వివాహం అనంతరం రాజ్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. తమ పెళ్లి కోసం బంధువులు అమెరికా, కెనడా నుంచి వచ్చారని, కానీ కర్ఫ్యూ కారణంగా వివాహానికి హాజరుకాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. వారందరూ ఖన్నాలోని తమ ఇంట్లోనే బందీలుగా ఉండిపోయారని పేర్కొన్నాడు.

Updated Date - 2020-04-06T21:03:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising