ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంతలో పాత నోట్లు.. ఓ అమాయకపు తల్లి ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2020-07-11T15:54:01+05:30

కుమార్తె వివాహం కోసం దాచిన రూ.500, రూ.1,000 నోట్లు చెల్లవని తెలియడంతో ఆ అమాయకపు తల్లి తల్లడిల్లిపోయింది. నాగపట్టణం జిల్లా శీర్గాళి సమీపం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కుమార్తె వివాహం కోసం దాచిన రూ.500, రూ.1,000 నోట్లు చెల్లవని తెలియడంతో ఆ అమాయకపు తల్లి తల్లడిల్లిపోయింది. నాగపట్టణం జిల్లా శీర్గాళి సమీపం పట్టియమేడుకు చెందిన ఉష (52) దివ్యాంగురాలు. ఉపాధి హామీ పనులకు వెళ్తూ తన కుమార్తె వివాహం కోసం డబ్బులు పొదుపు చేసింది.  ఇంటి వెనుక ప్రాంతంలో గుంత తవ్వి అందులో రూ.500, రూ.1,000 నోట్లను ఉంచింది. ఇటీవల ఆమె భర్త  రాజా దురై ఇంటి పునర్మిర్మాణం చేపట్టగా ఆ  డబ్బుల బ్యాగు బయటపడింది. అందులో రూ.1,000 నోట్లు పది, రూ.500 నోట్లు 51 ఉన్నాయి. దీంతో దిగ్ర్భాంతి చెందిన రాజాదురై, నాలుగేళ్ల క్రితమే ఈ నోట్లు చెల్లవని ప్రభుత్వం ప్రకటించిందని భార్యతో తెలిపాడు. తనకు ఈ విషయం ఎవరూ చెప్పలేదని ఆమె అమాయకంగా బదులిచ్చింది. ఆ దివ్యాంగురాలికి సాయం చేసేలా ప్రభుత్వం ముందుకు రావాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-07-11T15:54:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising