ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా నుంచి చైనా వచ్చిన రొయ్యలు.. కరోనా పాజిటివ్ అని తేలడంతో..

ABN, First Publish Date - 2020-07-11T22:54:44+05:30

దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశం నుంచి చైనాకు ఇటీవల వందల టన్నుల రొయ్యలు చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశం నుంచి చైనాకు ఇటీవల వందల టన్నుల రొయ్యలు చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం వీటన్నిటినీ ఓడరేవు వద్దే నిలిపివేస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. రొయ్యలను నిల్వచేసిన అతిశీతల ప్యాకేజీపై కరోనా వైరస్ ఉడడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు కస్టమ్స్ అధికారి బీ కెక్సిన్ మాట్లాడుతూ, వెలుపలి, లోపలి  ప్యాకేజింగ్‌లపై కరోనాను గుర్తించామని వెల్లడించారు. దీంతో ఈక్వెడార్‌లోని మూడు రొయ్యల ఉత్పత్తి ప్లాంట్ల నుంచి వచ్చిన సరుకును ఓడరేవులోనే నిలిపివేశామని తెలిపారు. అయితే ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందా, లేదా అనే విషయాలను పక్కన పెడితే ఆ కంపెనీలు పాటిస్తున్న ఆహార భద్రత నియమాలలోని లోపాలను ఎత్తిచూపుతున్నాయని కెక్సిన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బీజింగ్‌లోని ఓ మార్కెట్‌లో సాల్మన్ చేపలను కోయడానికి ఉపయోగించిన చెక్కపై కరోనా వైరస్‌ ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. కరోనా విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తోంది. ముఖ్యంగా సముద్ర ఉత్పత్తుల విషయంలో కచ్చితమైన ప్రమాణాలను అనుసరిస్తోంది.

Updated Date - 2020-07-11T22:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising