చెప్పు జారింది.. దొంగ దొరికాడు
ABN, First Publish Date - 2020-12-03T21:24:08+05:30
సినీ ఫక్కీలో ఓ ప్రయాణికుడి నుంచి చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని రామనాథపురానికి చెందిన మహమ్మద్ హసన్ అలీ దుబాయ్
చెన్నై: సినీ ఫక్కీలో ఓ ప్రయాణికుడి నుంచి చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని రామనాథపురానికి చెందిన మహమ్మద్ హసన్ అలీ దుబాయ్ నుంచి సోమవారం చెన్నై వచ్చాడు. ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన అతను.. బయటకు వెళ్లేందుకు గేటు వరకు వచ్చాడు. అయితే అతను నడుస్తూ ఉంటే కాలు నుంచి చెప్పు జారి పోయింది. అక్కడే ఉన్న కస్టమ్స్ అధికారి అది చూసి.. చెప్పు తీసి అతనికి ఇచ్చాడు. అయితే ఆ చెప్పు సాధారణంగా ఉండాల్సిన దానికంటే బరువుగా ఉంది. అనుమానం వచ్చిన సదరు అధికారి అతన్ని అదుపులోకి తీసుకుని చెప్పు తనిఖీ చేయగా రూ. 12 లక్షల విలువ చేసే 240 గ్రాముల బంగారం దొరికింది. దీంతో పాటు మరో 6.5 లక్షల విలువ చేసే సౌదీ రియల్స్, అమెరికన్ డాలర్స్ను స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు.
Updated Date - 2020-12-03T21:24:08+05:30 IST