కరోనా వెళ్లిపోయాక ఎలియన్స్ ఎంటరవుతాయట!
ABN, First Publish Date - 2020-05-21T12:45:44+05:30
దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండగా, అందుకు భిన్నంగా కర్నాటకలోని బెంగళూరులో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది.
బెంగళూరు: దేశంలో కరోనా విలయతాండవం చేస్తుండగా, అందుకు భిన్నంగా కర్నాటకలోని బెంగళూరులో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. 20 కిలోమీటర్ల పరిధిలో ఒక వింత శబ్ధం వినిపించింది. దీనిని విన్నవారంతా ఆశ్చర్యపోతూ పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ శబ్ధం ఏమిటై ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇది భూకంపం కారణంగా వచ్చిన శబ్ధమని తొలుత భావించారు. అయితే ఈ ప్రాంతంలో భూకంపం లాంటిది సంభవించలేదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఘటన కారణంగా ఎటువంటి నష్టం జరగలేదు. మరోవైపు అధికారులు దీనిగురించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంతలో నెటిజన్లు ఈ శబ్ధం గురించి పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఒక యూజర్ కరోనా వెళ్లిపోయాక ఎలియన్స్ ఎంటరవుతాయంటూ, దానికి ఈ శబ్ధం ఇండికేషన్ లాంటిదంటూ అభివర్ణించాడు.
Updated Date - 2020-05-21T12:45:44+05:30 IST