కూరల కొట్టు ఆఫర్ చూసి వినియోగదారులు షాక్!
ABN, First Publish Date - 2020-05-28T13:15:27+05:30
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని ఆ కూరగాయల దుకాణం మీదుగా వెళుతున్నవారంతా అక్కడున్న బోర్డు చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. ఆ బోర్డుపై... వీలైతే కొనండి, లేకపోతే ఉచితంగా తీసుకోండి...
ఔరంగాబాద్: మహారాష్ట్రలోని ఔరంగాబాద్లోని ఆ కూరగాయల దుకాణం మీదుగా వెళుతున్నవారంతా అక్కడున్న బోర్డు చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. ఆ బోర్డుపై... వీలైతే కొనండి, లేకపోతే ఉచితంగా తీసుకోండి... అని రాసివుంది. దీనిని చూసినవారంతా ఆ దుకాణం యజమానిని తెగ అభినందిస్తున్నారు. ఈ దుకాణాన్ని ఒక గ్రాడ్యుయేట్ నిర్వహిస్తున్నాడు. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే రాహుల్ లబాడే లాక్డౌన్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రహించి కూరగాయలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. లాక్డౌన్ కారణంగా అతను పనిచేసే ప్రైవేట్ సంస్థ జీతం ఇవ్వకపోవడంతో అతను తన తండ్రితో పాటు కూరగాయలు అమ్మాలని నిర్ణయించుకున్నాడు. మొదట అతను కూరగాయలను మార్కెట్ ధరలకే విక్రయించేవాడు. తరువాత అర్హులకు కూరగాయలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఒక వృద్ధురాలు తన దుకాణం దగ్గరకు వచ్చి ఐదు రూపాయలకు కూరగాయలు ఇవ్వాలని కోరిందని, అయితే ఐదు రూపాయలకు ఏమీ రావని చెప్పి, ఆమెకు ఉచితంగానే కూరగాయలు ఇచ్చానని తెలిపారు. ఆ తరువాత నుంచి అర్హులైనవారికి కూరగాయలు ఉచితంగా ఇస్తున్నానని తెలిపారు.
Updated Date - 2020-05-28T13:15:27+05:30 IST