ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌లో మూగ‌జీవాల ర‌క్ష‌కుడు ఆ యువ‌కుడు!

ABN, First Publish Date - 2020-06-02T16:11:18+05:30

కరోనా క‌ట్ట‌డికి విధించిన లాక్‌డౌన్‌లో పేద‌ల‌కు, వ‌ల‌స కూలీల‌కు అటు ప్ర‌భుత్వం, ఇటు సామాజిక సంస్థ‌లు ఆహారాన్ని అందించాయి. అయితే ఇదే లాక్‌డౌన్ స‌మ‌యంలో మూగ జీవాల‌ను ప‌ట్టించుకునే ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: కరోనా క‌ట్ట‌డికి విధించిన లాక్‌డౌన్‌లో పేద‌ల‌కు, వ‌ల‌స కూలీల‌కు అటు ప్ర‌భుత్వం, ఇటు సామాజిక సంస్థ‌లు ఆహారాన్ని అందించాయి. అయితే ఇదే లాక్‌డౌన్ స‌మ‌యంలో మూగ జీవాల‌ను ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడు. అయితే రాజ‌స్థాన్‌లోని జైపూర్‌న‌కు చెందిన ఒక యువకుడు 70 రోజుల పాటు జంతువులకు ఆహారం అందించాడు. ఇందుకోసం తన సొంత డబ్బును ఖర్చు చేశాడు. దీంతో వన్యప్రాణి ప్రేమికుడు వీరెన్ శర్మను స్థానికులంతా మెచ్చుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కోతులు, కుక్కలు, ఆవులు, ఇతర జంతువులకు ఆహారం అందించేందుకు వీరెన్ శర్మ వివిధ‌ గ్రామీణ ప్రాంతాలలో తిరిగాడు. విరెన్ శర్మ ప్రతిరోజూ శున‌కాల కోసం 600 ఫుడ్ ప్యాకెట్లను సిద్ధం చేశాడు. త‌న స్నేహితుల‌తో పాటు వివిధ ప్రాంతాల‌కు వెళ్లి ఆ  ఆహారాన్ని వాటికి అందించాడు. అలాగే ఆవులకు పశుగ్రాసం,  కోతులకు అరటిపండ్లు అందించాడు. ఈ మూగ‌జీవాల‌ను ప్రభుత్వం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని వీరెన్ ఆరోపించాడు.

Updated Date - 2020-06-02T16:11:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising