ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లిని సమాధి చేసిన కన్నకొడుకు

ABN, First Publish Date - 2020-05-09T14:06:50+05:30

కొడుకును నవమాసాలు మోసి, కని, పెంచి పెద్ద చేసిన ఆ తల్లి, వృద్ధాప్యంలో పక్షవాతం బారిన పడింది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ పుత్రరత్నం, బాధ్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 3రోజుల అనంతరం వెలికితీత.. చైనాలో దారుణం

బీజింగ్‌, మే 8: కొడుకును నవమాసాలు మోసి, కని, పెంచి పెద్ద చేసిన ఆ తల్లి, వృద్ధాప్యంలో పక్షవాతం బారిన పడింది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ పుత్రరత్నం, బాధ్యతను భారంగా భావించి తల్లిని సజీవ సమాధి చేశాడు. ఈ దారుణ ఘటన చైనాలో చోటుచేసుకుంది. షాంజీ ప్రావిన్స్‌లోని జింగ్‌బియాన్‌ కౌంటీకి చెందిన మా(58) తల్లి వాంగ్‌(79) గత కొంతకాలంగా పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. దీంతో మా ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. 3రోజుల క్రితం తల్లిని మోసుకుని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు.


అక్కడ ఆమెను సమాధి చేసి ఇంటికి వచ్చేశాడు. ఆమె జాడ లేకపోవడంతో.. చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల విచారణలో మా తన తల్లిని సమాధి చేసిన చోటు చూపించాడు. వారు వెంటనే ఆమెను బయటికి తీయగా కొన ఊపిరితో కనిపించింది. వెంటనే వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించారు. మా పై హత్యాయత్నం కేసు నమోదైంది. సమాధిని పైపైనే పూడ్చటం వల్ల యాంగ్‌ బతికిబట్టకట్టిందని అధికారులు చెప్పారు. 

Updated Date - 2020-05-09T14:06:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising