యూఏఈలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న మహమ్మారి !
ABN, First Publish Date - 2020-07-12T18:23:11+05:30
యూఏఈలో మహమ్మారి కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది.
యూఏఈ: యూఏఈలో మహమ్మారి కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. శనివారం 403 కొత్త కేసులు నమోదు కాగా... 679 రికవరీలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోవిడ్-19 సోకిన వారి సంఖ్య 54,453కు చేరింది. అలాగే మొత్తం కోలుకున్న వారు 44,648 మంది అయ్యారు. ఇప్పటికే యూఏఈ వ్యాప్తంగా ఈ వైరస్ 331 మందిని కబళించింది. కాగా, క్రమంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో యూఏఈలో రికవరీ రేటు 81.32 శాతానికి చేరింది. మరోవైపు యూఏఈ ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ముమ్మరంగా కోవిడ్ టెస్టులు చేస్తోంది. ఇప్పటికే నాలుగు మిలియన్ వరకు కరోనా పరీక్షలు పూర్తి చేసిన యూఏఈ.. ఆగస్టు నెలాఖరు వరకు ఆరు మిలియన్ల కోవిడ్ టెస్టులు నిర్వహించాలని నిర్దేశించుకుంది. ఇదిలా ఉంటే... ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న మహమ్మారి ఇప్పటికే 5.67 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. అలాగే వరల్డ్వైడ్గా కోటి 28 లక్షల మంది కోవిడ్ బాధితులు ఉన్నారు.
Updated Date - 2020-07-12T18:23:11+05:30 IST