ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహమ్మారి నుంచి క్రమంగా కోలుకుంటోన్న యూఏఈ!

ABN, First Publish Date - 2020-07-13T15:58:01+05:30

కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. మహమ్మారి నుంచి యూఏఈ క్రమంగా కోలుకుంటోంది. యూఏఈలో కరోనా బారిన పడిన వారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కాగా.. మహమ్మారి నుంచి యూఏఈ క్రమంగా కోలుకుంటోంది. యూఏఈలో కరోనా బారిన పడిన వారి సంఖ్య కంటే.. కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఆదివారం రోజు యూఏఈలో 401కరోనా కేసులు నమోదవ్వగా.. 492 మంది కొవిడ్-19‌ను జయించి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదే సమయంలో మహమ్మారికి ఇద్దరు బలయ్యారు. కాగా.. యూఏఈ‌లో ఇప్పటి వరకు 54,854 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 45,140 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 333 మంది కొవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యూఏఈలో 9,381 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 1.30కోట్లకు చేరువైన వేళ.. మహమ్మారిని కట్టడి చేయడానికి యూఏఈ తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయి. కాగా.. మహమ్మారి ప్రభావం ప్రజలపై పడకుండా  ఎమిరేట్స్ ఇప్పటి వరకు 6.3 బిలియన్ దిర్హామ్స్‌ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. 


Updated Date - 2020-07-13T15:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising