సౌదీ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత యువకులు దుర్మరణం !
ABN, First Publish Date - 2020-09-25T14:32:52+05:30
సౌదీ అరేబియాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత యువకులు దుర్మరణం చెందారు.
దమ్మం: సౌదీ అరేబియాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత యువకులు దుర్మరణం చెందారు. దమ్మం దహ్రాన్ మాల్ వద్ద గురువారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు ముగ్గురు కూడా కేరళ వాసులే. మృతులను వయనాడ్కు చెందిన అన్సీఫ్(22), కోజికోడ్ వాసి సనద్(22), మలప్పురంకు చెందిన మహమ్మద్ షిఫీక్(22)గా గుర్తించారు. ముగ్గురు యువకులు సౌదీ నేషనల్ డే సెలబ్రేషన్స్లో పాల్గొని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను దమ్మం మెడికల్ కాంప్లెక్స్ హాస్పిటల్కు తరలించారు. కాగా, ఈ ముగ్గురు కూడా డామా ఇండియన్ స్కూల్ మాజీ విద్యార్థులు అని తెలిసింది. ముగ్గురు యువకుల కుటుంబాలు డామాలోనే నివసిస్తున్నాయి.
Updated Date - 2020-09-25T14:32:52+05:30 IST