వంగపండు మృతి పట్ల 'తానా' సంతాపం
ABN, First Publish Date - 2020-08-04T17:57:04+05:30
ప్రజావాగ్గేయ కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల తెలుగు అసొసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) సంతాపం తెలిపింది. ఆయన ఆకస్మిక మరణం కళా రంగానికే తీరని లోటు అని పేర్కొంది.
ప్రజావాగ్గేయ కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల తెలుగు అసొసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) సంతాపం తెలిపింది. ఆయన ఆకస్మిక మరణం కళా రంగానికే తీరని లోటు అని పేర్కొంది. వంగపండు కుటుంబ సభ్యులకు తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మే 31న ప్రారంభమైన తానా ప్రపంచ సాహిత్య వేదికకు వంగపండు ముఖ్య అతిధిగా హాజరై తన బృందంతో అంతర్జాలంలో అద్భుతమైన పాటలు పాడి అందరిని అలరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే ఆయన చివరి కార్యక్రమం గావడం దురదృష్టకరం అని అన్నారు. 2017లో 'అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' తరఫున వంగపండుకు జానపద కళారత్న అవార్డుతో సత్కరించినట్లు ప్రసాద్ తోటకూర తెలిపారు.
వంగపండు గారి చివరి కార్యక్రమాన్ని ఈ యూట్యూబ్ వీడియోలో చూడవచ్చు.
Updated Date - 2020-08-04T17:57:04+05:30 IST