ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాషింగ్టన్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన 224 మంది భారతీయులు

ABN, First Publish Date - 2020-06-25T21:38:04+05:30

వందే భారత్ మిషన్‌లో భాగంగా అమెరికాలో చిక్కుకున్న 224 మంది భారతీయులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: వందే భారత్ మిషన్‌లో భాగంగా అమెరికాలో చిక్కుకున్న 224 మంది భారతీయులు మరికొద్ది గంటల్లో భారత్‌కు చేరుకోనున్నారు. వాషింగ్టన్‌ ఎయిర్‌పోర్ట్ నుంచి కొద్ది గంటల క్రితం ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానంలో పసిపిల్లలు కూడా ప్రయాణం చేస్తున్నట్టు ఇండియన్ ఎంబసి పేర్కొంది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను కేంద్రం వందే భారత్ మిషన్ పేరిట స్వదేశానికి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మిషన్‌లో రెండు విడతలు పూర్తికాగా.. ప్రస్తుతం మూడో విడత నడుస్తోంది. జూన్ 10న మొదలైన మూడో విడత జూన్ 30 వరకు కొనసాగనుంది. ఈ విడతలో మొత్తంగా 550 విమానాల ద్వారా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులు తమ మాతృభూమికి చేరుకోనున్నారు. కాగా.. ఇప్పటివరకు విదేశాల్లో చిక్కుకున్న దాదాపు లక్షా 25 వేల మంది భారతీయులను ఈ మిషన్ కింద తీసుకొచ్చినట్టు మంగళవారం విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 6,037 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టు ఆయన వెల్లడించారు. 

Updated Date - 2020-06-25T21:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising