షార్జా డిప్యూటీ రూలర్ కన్నుమూత
ABN, First Publish Date - 2020-07-10T19:46:06+05:30
షార్జా డిప్యూటీ రూలర్, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ అహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి గురువారం లండన్లో కన్నుమూశారు.
షార్జా: షార్జా డిప్యూటీ రూలర్, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ అహ్మద్ బిన్ సుల్తాన్ అల్ ఖాసిమి గురువారం లండన్లో కన్నుమూశారు. ఆయన మృతికి సంతాపం తెలిపిన సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా రూలర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి దేశవ్యాప్తంగా మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. అలాగే ఈ మూడు రోజులు జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని సూచించారు. సుల్తాన్ అల్ ఖాసిమి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేసిన షార్జా రూలర్ ఆయన ఆత్మకు శాంతి చేకురాలని ఆకాంక్షించారు. కాగా, ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల దృష్ట్యా జన సమూహాలకు అనుమతి లేనందున సుల్తాన్ అల్ ఖాసిమి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసేవారు కేవలం ఫోన్ ద్వారా మాత్రమే సంప్రదించాలని అధికారులు కోరారు. దీనికోసం త్వరలో ఒక ఫోన్ నెంబర్ ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలియజేశారు.
Updated Date - 2020-07-10T19:46:06+05:30 IST