అమెరికాలో గడిచిన 24 గంటల్లో 960 మరణాలు...
ABN, First Publish Date - 2020-05-31T17:50:57+05:30
అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ మృత్యు హేల కొనసాగుతోంది.
వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ మృత్యు హేల కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 960 మంది కోవిడ్-19తో మరణించారు. దీంతో ఇప్పటివరకూ యూఎస్లో ఈ వైరస్ బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య 103,758కి చేరిందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.అలాగే దేశవ్యాప్తంగా 1,769,776 మందికి సోకింది. మరోవైపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ)తో ట్రంప్ తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ డబ్ల్యూహెచ్ఓకు అత్యాధిక నిధులు సమాకూర్చింది అగ్రరాజ్యమే అనడంలో సందేహం లేదు. అలాంటిది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ ఇలా అమెరికా అర్ధాంతరంగా నిధులు నిలిపివేయడంతో డబ్ల్యూహెచ్ఓ పాలుపోవడం లేదు. ఇదిలాఉంటే... ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బాధితులు 60 లక్షలు దాటిపోగా, మృతుల సంఖ్య 3.70 లక్షలుగా ఉంది.
Updated Date - 2020-05-31T17:50:57+05:30 IST