ఒమన్లో 50వేలు దాటిన కరోనా కేసులు..!
ABN, First Publish Date - 2020-07-09T08:17:47+05:30
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమన్లోనూ మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. బుధవారం రోజు ఒమన్లో 1,210 కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్య ఆ
కైరో: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమన్లోనూ మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తోంది. బుధవారం రోజు ఒమన్లో 1,210 కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అంతేకాకుండా నిన్న ఒక్కటే రోజు 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే.. నిన్న కరోనా బారినపడిన వారిలో 271 మంది విదేశీ పౌరులు ఉన్నట్లు పేర్కొంది. బుధవారం రోజు నమోదైన కేసుల సంఖ్యతో.. ఇప్పటి వరకు ఒమన్లో కరోనా బారినపడిన వారి సంఖ్య 50వేలు దాటింది. ఇందులో దాదాపు 32వేల మంది కరోనాను జయించి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా..కరోనా కాటుకు ఇప్పటి వరకు 233 మంది ప్రాణాలు కోల్పోయారు.
Updated Date - 2020-07-09T08:17:47+05:30 IST