మళ్లీ ఎంట్రీ రూల్స్ మార్చిన ఒమన్ !
ABN, First Publish Date - 2020-12-29T14:04:48+05:30
గల్ఫ్ దేశం ఒమన్ కరోనా కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మస్కట్: గల్ఫ్ దేశం ఒమన్ కరోనా కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి విమాన, రోడ్డు, జల మార్గాలను ఓపెన్ చేస్తూ నిర్ణయం తీసుకున్న ఒమన్ మరోసారి ఎంట్రీ రూల్స్ను మార్చింది. దేశంలో ప్రవేశించే వారికి పీసీఆర్ టెస్టు తప్పనిసరి చేసింది. అలాగే సందర్శకులకు ఏడు రోజుల క్వారంటైన్ కూడా తప్పనిసరి అని సుప్రీం కమిటీ సూచించింది. విమానాశ్రయంలో దిగగానే ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న కరోనా నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాలి. అనంతరం విమానాశ్రయంలోనే పీసీఆర్ టెస్టు నిర్వహించి 24 గంటలలోపు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుందని అధికారులు వెల్లడించారు. దీనికోసం ఓ ప్రత్యేక యాప్ను రూపొందించినట్లు తెలిపారు. ఈ యాప్ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Updated Date - 2020-12-29T14:04:48+05:30 IST