ఎన్నారై దంపతుల దారుణ హత్య..!
ABN, First Publish Date - 2020-05-31T14:23:19+05:30
ఎన్నారై దంపతులు హత్యకు గురైన దారుణ సంఘటన పంజాబ్లోని ఫగ్వారాలో చోటు చేసుకుంది.
ఫగ్వారా(పంజాబ్): ఎన్నారై దంపతులు హత్యకు గురైన దారుణ సంఘటన పంజాబ్లోని ఫగ్వారాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కెనడాలో ఉండే కిర్పాల్ సింగ్ మిన్హాస్ (67), దేవిందర్ కౌర్ (65) దంపతులు గతేడాది నవంబర్లో స్వస్థలమైన ఫగ్వారాలోని ఓంకర్ నగర్కు వచ్చారు. కొన్ని నెలలు ఇక్కడే ఉండి తిరిగి కెనడాకు వెళ్లాల్సింది. కానీ, కరోనా లాక్డౌన్ వల్ల భారత్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. కొన్ని రోజుల క్రితమే తిరిగి కెనడా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, శనివారం రాత్రి ఉన్నట్టుండి ఈ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో దంపతుల గొంతు కోసి హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఈ హత్య అనంతరం కిర్పాల్ సింగ్ ఇంట్లో అద్దెకు ఉండే జస్సీ ధోలీ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
Updated Date - 2020-05-31T14:23:19+05:30 IST