నూతన రెవెన్యూ చట్టం దేశానికే ఆదర్శం: అనిల్ కూర్మాచలం
ABN, First Publish Date - 2020-09-10T20:05:28+05:30
రాష్ట్రాన్ని ఉద్యమంలా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాల్లో ఇటీవల అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ చట్టం ప్రత్యేకమైనదని ఎన్నారై టీఆర్ఎస్ యూకే వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.
లండన్: రాష్ట్రాన్ని ఉద్యమంలా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాల్లో ఇటీవల అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన నూతన రెవెన్యూ చట్టం ప్రత్యేకమైనదని ఎన్నారై టీఆర్ఎస్ యూకే వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. నూతన రెవిన్యూ చట్టం ద్వారా పేద రైతులకి ఎంతో మేలు జరుగుతుందని, భూముల క్రయ విక్రయాల్లో పారదర్శకత ఉంటుందని, ఇది దేశానికే ఆదర్శమవుతుందని అనిల్ కూర్మాచలం అన్నారు. ప్రజా నాయకుడిగా కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యావత్ ఎన్నారై సమాజం హర్షిస్తుందని తెలిపారు. ఇలాంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నందుకు కేసీఆర్కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
Updated Date - 2020-09-10T20:05:28+05:30 IST