ఖషోగి కుటుంబీకుల సంచలన నిర్ణయం..!
ABN, First Publish Date - 2020-05-23T15:57:38+05:30
సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగి 2018, అక్టోబర్ 2న టర్కీలోని ఇస్తాంబుల్లో గల సౌదీ కాన్సులేట్ కార్యాలయం వద్ద దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
రియాధ్: సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగి 2018, అక్టోబర్ 2న టర్కీలోని ఇస్తాంబుల్లో గల సౌదీ కాన్సులేట్ కార్యాలయం వద్ద దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ఈ హత్య నిందితులకు ఉరిశిక్ష పడింది. అయితే, తాజాగా ఖషోగి కుటుంబ సభ్యులు ఈ విషయమై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉరిశిక్ష పడిన హంతకులకు ఖషోగి కుటుంబం క్షమాభిక్ష ప్రసాదించింది. ఈ మేరకు అతని కుమారుడు సలాహ్ ఖషోగి ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తన తండ్రిని చంపిన హంతకుల్ని క్షమించేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది తమ కుటుంబ సభ్యులందరూ కలిసి తీసుకున్న నిర్ణయంగా సలాహ్ పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా అల్లా నిర్ధేశించిన మార్గంలో కిరాతకుల్ని క్షమిస్తూ తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
Updated Date - 2020-05-23T15:57:38+05:30 IST