భారత్కు ఇజ్రాయెల్ ‘స్నేహితుల దినోత్సవ’ శుభాకాంక్షలు
ABN, First Publish Date - 2020-08-03T14:06:10+05:30
భారత్కు ఇజ్రాయెల్ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ‘భారత్లోని మా మిత్రులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని రీయువె
జెరూసలెం, ఆగస్టు 2: భారత్కు ఇజ్రాయెల్ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. ‘భారత్లోని మా మిత్రులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని రీయువెన్ రివ్లిన్ ఇంగ్లి్షతో పాటు హిందీలో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో గతంలో దిగిన ఫొటోను ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నటించిన ఓ సినిమాలోని ‘తేరే జైసా యార్ కహా, కహా ఐసా యారానా’ (నీలాంటి మిత్రుడు ఎక్కడా లేడు, మీలాంటి మిత్రత్వం ఎక్కడా దొరకదు) పాటలోని మొదటి వాక్యాన్ని గుర్తు చేస్తూ ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహబంధాన్ని భారత్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ఓ వీడియో రూపంలో చూపింది. భవిష్యత్తులో ఇరు దేశాల స్నేహ బంధం మరింత బలపడుతుందని పేర్కొంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధులు కూడా భారత్కు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Updated Date - 2020-08-03T14:06:10+05:30 IST