ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ‌ర్మనీలో భార‌తీయ వ్య‌క్తిపై గూఢ‌చ‌ర్యం కేసు.. కోర్టులో విచార‌ణ‌..

ABN, First Publish Date - 2020-05-10T00:15:15+05:30

జర్మనీలో సిక్కులు, కాశ్మీరీలపై గూఢ‌చర్యం చేసినందుకు ప్ర‌స్తుతం ఓ భార‌త వ్య‌క్తి స్థానిక‌ ఫెడ‌ర‌ల్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెర్లిన్‌: జర్మనీలో సిక్కులు, కాశ్మీరీలపై గూఢ‌చర్యం చేసినందుకు ప్ర‌స్తుతం ఓ భార‌త వ్య‌క్తి స్థానిక‌ ఫెడ‌ర‌ల్ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు. న్యూఢిల్లీలోని ఓ సీక్రెట్ ఏజెన్సీ కోసం అత‌ను ప‌ని చేసిన‌‌ట్లు శుక్ర‌వారం జ‌రిగిన కోర్టు విచార‌ణ‌లో తేలింది. నిందితుడు బ‌ల్వీర్(54)... భారత ఫారిన్‌ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్‌ అనాలిసిస్ వింగ్ కోసం 2015 నుండి ప‌ని చేస్తున్న‌ట్లు తేల్చారు. ఐదేళ్లుగా జ‌ర్మ‌నీలోని సిక్కులు, కాశ్మీరీల‌పై గూఢ‌చ‌ర్యం నిర్వ‌హించిన బ‌ల్వీర్‌ ఆ స‌మాచారాన్ని ఏజెన్సీకి అంద‌జేసిన‌ట్లు ఫ్రాంక్ఫర్ట్ న్యాయ‌స్థానం పేర్కొంది. ఆగ‌స్టు 25న మ‌రోసారి ఈ కేసు కోర్టులో విచార‌ణ‌కు రానుంది. గ‌త డిసెంబ‌ర్‌లో ఇదే న్యాయ‌స్థానం సిక్కులు, కాశ్మీరీలపై  గూఢ‌చ‌ర్యం నిర్వ‌హించిన ఓ భార‌తీయ జంట‌ను కూగా దోషిగా తేల్చిన విష‌యం తెలిసిందే.   


Updated Date - 2020-05-10T00:15:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising