ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8వసారి..ఐరాస భద్రతా మండలికి ఎన్నికైన భారత్..!

ABN, First Publish Date - 2020-06-18T08:04:47+05:30

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశంగా భారత్ 8వసారి ఎన్నికయ్యింది. 192 ఓట్లకుగాను 184 ఓట్లు పొంది.. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యదేశంగా భారత్ 8వసారి ఎన్నికయ్యింది. 192 ఓట్లకుగాను 184 ఓట్లు పొంది.. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ తన స్థానాన్ని పదిలపర్చుకుంది. దీంతో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ మరో రెండు సంవత్సరాలు కొనసాగనుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఉంటాయి. అందులో 5 శాశ్వత సభ్యదేశాలు కాగా.. 10 తాత్కాలిక సభ్యదేశాలు. తాత్కాలిక సభ్యదేశాలు రెండేళ్ల కాలవ్యవధి కొరకు ఎన్నికవుతాయి. భద్రతా మండలిలో అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్‌లు శాశ్వత సభ్యదేశాలు. ఈ దేశాలకు వీటో అధికారం ఉంటుంది. ఏదైనా విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలంటే ఈ ఐదు దేశాలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. 


Updated Date - 2020-06-18T08:04:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising