బ్రెజిల్లో ఒకేరోజు 27 వేల కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-05-31T04:17:43+05:30
బ్రెజిల్లో శుక్రవారం ఒక్కరోజే 26,928 కరోనా కేసులు నమోదైనట్టు ఆ
బ్రసిలియా: బ్రెజిల్లో శుక్రవారం ఒక్కరోజే 26,928 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కరోనా బారిన పడి ఒకేరోజు 1,124 మంది మృత్యువాతపడ్డారు. ఒకేరోజు ఇన్ని కేసులు నమోదుకావడంపై ఆరోగ్యశాఖ ఆవేదన వ్యక్తం చేసింది. కేసులు ఒకేసారి ఎప్పుడు పెరుగుతాయో ముందుగా తెలుసుకునే మార్గం లేదని ఆరోగ్యశాఖ తెలిపింది. మరోపక్క కరోనా మరణాల సంఖ్యలో స్పెయిన్ను బ్రెజిల్ దాటేసింది. స్పెయిన్లో ఇప్పటివరకు 27,121 మంది కరోనా బారిన పడి మరణించగా.. బ్రెజిల్లో ఈ సంఖ్య 28,015గా ఉంది. రెండు, మూడు రోజుల్లో బ్రెజిల్ ఫ్రాన్స్ను కూడా అధిగమిస్తుందని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం బ్రెజిల్లో 4,69,510 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క స్పెయిన్లో 2,85,644 మంది ఇప్పటివరకు కరోనా బారిన పడ్డారు. కరోనా మరణాల సంఖ్యలో మొదటి మూడు దేశాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాలు ఉన్నాయి. బ్రెజిల్లో ప్రతి పది లక్షల మందిలో 131 మంది మరణించినట్టు లెక్కలు చెబుతున్నాయి. అమెరికాలో ఈ సంఖ్య 300కు పైగా ఉంటే.. స్పెయిన్,లో 580గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు 60,86,344 కరోనా కేసులు నమోదుకాగా.. 3,68,462 మంది మరణించారు.
Updated Date - 2020-05-31T04:17:43+05:30 IST