ఇండియానాలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి !
ABN, First Publish Date - 2020-09-13T18:10:28+05:30
అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో గల మిషావాక నగరంలో శనివారం కాల్పులు కలకలం సృష్టించాయి.
మిషావాక(ఇండియానా): అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో గల మిషావాక నగరంలో శనివారం కాల్పులు కలకలం సృష్టించాయి. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మిషావాక యూనివర్సిటీ పార్క్ మాల్లో కాల్పులు చోటుచేసుకోవడంతో ఒకరు చనిపోయినట్లు సెయింట్ జోసెఫ్ కౌంటీ కరోనర్ మైఖేల్ మెక్గాన్ వెల్లడించారు. అయితే, మృతుడి వివరాలను ఆయన వెల్లడించలేదు. అలాగే పోలీసులు కూడా షూటింగ్ అనుమానితుడిపై సమాచారాన్ని విడుదల చేయలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో విషయం బయటకు తెలిసింది. ఇక కాల్పులు జరిగిన సెకండ్ల వ్యవధిలోనే మాల్ నుంచి జనాలు బయటకు పరుగులు తీయడం వీడియోలో ఉంది.
Updated Date - 2020-09-13T18:10:28+05:30 IST