ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో.. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు వణుకుతున్న క్యాబ్ డ్రైవర్లు

ABN, First Publish Date - 2020-02-17T00:16:48+05:30

కరోనా మహమ్మారి చైనీయులకు శాపంగా మారింది. ప్రపంచదేశాలలో చైనా దేశస్థులు ఎక్కడ కనిపించినా స్థానికులు వారిపై దాడులకు దిగుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: కరోనా మహమ్మారి చైనీయులకు శాపంగా మారింది. ప్రపంచదేశాలలో చైనా దేశస్థులు ఎక్కడ కనిపించినా స్థానికులు వారిపై దాడులకు దిగుతున్నారు. ఇటీవల అమెరికాలో చైనాకు చెందిన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కాలిఫోర్నియాలోని చైనాటౌన్ మెట్రో స్టేషన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వార్త మరువక ముందే లాస్ ఏంజెల్స్‌లో చైనా దేశస్థులను అమెరికన్లు దూషిస్తున్నారంటూ మరో వార్త వచ్చింది. చైనీయుల వల్ల తమ దేశస్థులకు కరోనా సోకుతోందంటూ అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో చైనీయులు ఎక్కడ కనిపించినా వారిపై ఆగ్రహం వెల్లగక్కుతున్నారు.


ఇదిలా ఉండగా.. న్యూయార్క్‌లోని ఫ్లషింగ్ ప్రాంతానికి వెళ్లేందుకు క్యాబ్ డ్రైవర్లు జంకుతున్నారు. ఈ ప్రాంతంలో చైనా దేశస్థులు ఎక్కువగా జీవిస్తుండటమే దీనికి కారణం. ఫ్లషింగ్ ప్రాంతంలో 70 వేలకు పైగా చైనా దేశస్థులు నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని కస్టమర్లను ఎక్కించుకుంటే తమకు కూడా కరోనా వైరస్ సోకుతుందేమోనని క్యాబ్ డ్రైవర్లు భయపడుతున్నారు. ఆ ప్రాంతానికి వెళ్తే.. యాప్‌లో ఆన్‌లైన్ నుంచి ఆఫ్ లైన్‌కు వెళ్లిపోతున్నారు. తిరిగి వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి ఆన్‌లైన్‌కు వస్తున్నారు. ‘చైనీయులను ఎక్కించుకోకపోవడం బాధగా అనిపిస్తోంది. కానీ.. నాకు కూడా కుటుంబం ఉంది. చైనీయుల వల్ల నాకు వైరస్ వస్తే నా కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు?’ అని ఓ క్యాబ్ డ్రైవర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఫ్లషింగ్ ప్రాంతమే కాకుండా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి వచ్చే ప్రయాణికులను సైతం క్యాబ్ ఎక్కించుకోడానికి డ్రైవర్లు భయపడుతున్నారు.  


కాగా.. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 16 మంది కరోనా బారిన పడ్డారు. అయితే ఇందులో ఒక్క కేసు కూడా న్యూయార్క్ నుంచి నమోదు కాలేదు. క్యాబ్ డ్రైవర్ల వల్ల ఏ ఒక్కరైనా వివక్షకు గురైతే తగిన చర్యలు తీసుకుంటామంటూ ట్యాక్సీ అండ్ లిమోజిన్ కమిషన్ అధికారులు స్పష్టం చేశారు. క్యాబ్ డ్రైవర్లపై వివక్షకు సంబంధించి కేసులు నమోదైతే.. మొదటిసారి 500 డాలర్ల జరిమానా.. రెండో సరా 1000 డాలర్ల జరిమానాతో పాటు నెల రోజులు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామన్నారు. మూడో సారి కూడా కేసు నమోదైతే క్యాబ్ డ్రైవర్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2020-02-17T00:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising