కువైట్ సంస్థల స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్.. భారత ప్రవాసులకు మాత్రమే
ABN, First Publish Date - 2020-08-15T19:25:04+05:30
కువైట్కు చెందిన అల్ టేయర్ గ్రూప్, లగ్జరీ ట్రావెల్స్ సంస్థలు భారత 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడి భారత ప్రవాసులకు ఆఫర్ ప్రకటించాయి.
కువైట్ సిటీ: కువైట్కు చెందిన అల్ టేయర్ గ్రూప్, లగ్జరీ ట్రావెల్స్ సంస్థలు భారత 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడి భారత ప్రవాసులకు ఆఫర్ ప్రకటించాయి. ప్రధానంగా కరోనా వల్ల కువైట్లో చిక్కుకున్న భారతీయులకు ఈ ఆఫర్ అని పేర్కొన్నాయి.
ఈ సందర్భంగా అల్ టేయర్ గ్రూప్ సీఈఓ ఫర్హాద్ మాట్లాడుతూ కువైట్లోని భారత ప్రవాసులకు స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. "మహమ్మారి సమయంలో తమ దేశానికి తిరిగి వెళ్లాలని కోరుకునే పెద్ద సంఖ్యలో భారతీయులకు సహాయం చేయగలిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా విమానాలలో పెద్ద సంఖ్యలో భారతీయులను ఇండియాలోని వివిధ గమ్యస్థానాలకు తీసుకువెళ్ళాము. రాబోయే రోజుల్లో మేము భారతదేశానికి మరిన్ని విమానాలను నడుపుతాము" అని అన్నారు. దీనికి సహకరించిన కువైట్లోని భారత రాయబార కార్యాలయం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలు, భారత సమాజానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్ కింద ఆగస్టు 17న చెన్నైకి వెళ్లే విమానంలో ఆగస్టు 15న మొదటి పది బుకింగ్లకు బిజినెస్ క్లాస్కు ఉచిత అప్గ్రేడ్ను అందిస్తున్నామని లగ్జరీ ట్రావెల్స్ ఆపరేషన్స్ మేనేజర్ బాబీ థామస్ తెలియజేశారు. అంతేగాక ఈ గ్రూపు ఆగస్టు 21న హైదరాబాద్కు... ఆగస్టు 25న ఢిల్లీ, కొచ్చికు... ఆగస్టు 27న త్రివేండ్రం, గయా పాట్నాకు విమానాలను నడపనుంది.
Updated Date - 2020-08-15T19:25:04+05:30 IST