ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్ణయం మార్చుకున్న దుబాయ్.. ఎయిర్ ఇండియా విమానాలకు గ్రీన్ సిగ్నల్!

ABN, First Publish Date - 2020-09-19T15:44:26+05:30

భారత్ నుంచి దుబాయికి వెళ్లే ప్రయాణికులకు దుబాయ్ పౌర విమానయాన శాఖ తీపి కబురు చెప్పింది. ఎయిర్ ఇండియా వి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి: భారత్ నుంచి దుబాయికి వెళ్లే ప్రయాణికులకు దుబాయ్ పౌర విమానయాన శాఖ తీపి కబురు చెప్పింది. ఎయిర్ ఇండియా విమానాలపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి దుబాయి-ఇండియాల మధ్య ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలు కొనసాగుతాయని వెల్లడించింది. కాగా.. కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఎయిర్ ఇండియా విమానాలపై అక్టోబర్ 2 వరకు నిషేధం విధిస్తున్నట్లు దుబాయ్ పౌర విమానయాన శాఖ శుక్రవారం ప్రకటించింది. రెండు వారాల్లో కొవిడ్ బారినపడ్డ ఇద్దరు ప్రయాణికులను.. ఎయిర్ ఇండియా విమానం దుబాయికి తీసుకొచ్చినట్లు ప్రకటనలో పేర్కొంది. అయితే నిషేధం విధించిన గంటల వ్యవధిలోనే.. దుబాయ్ పౌర విమానయానశాఖ తన నిర్ణయాన్ని మార్చుకుంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. దుబాయి-ఇండియా మధ్య ఎయిర్ ఇండియా విమానాలు రాకపోకలు కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


Updated Date - 2020-09-19T15:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising