సింగపూర్లో చిక్కుకున్న వారి కోసం ప్రత్యేక విమానం: మోహన్ బాబు
ABN, First Publish Date - 2020-06-02T04:24:16+05:30
సింగపూర్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు
హైదరాబాద్: సింగపూర్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేక చార్టర్డ్ విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు నటుడు మోహన్ బాబు తెలిపారు. వచ్చే వారం ఈ విమానం సింగపూర్ నుంచి హైదరాబాద్కు రానున్నట్టు ఆయన పేర్కొన్నారు. సింగపూర్లో చిక్కుకుని హైదరాబాద్ రావాలనుకుంటున్న వారిని వివరాలివ్వమంటూ ఆయన ట్వీట్ పెట్టారు. ఈ విమానంలో రావాలనుకుంటున్న వారు తమ పూర్తి పేరు, నెంబర్ను singhydplane@gmail.comకు పంపాల్సిందిగా మోహన్ బాబు కోరారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వందే భారత్ మిషన్ పేరిట విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొస్తోంది. ఇదే సమయంలో విదేశాల నుంచి వచ్చే వారు తమ ప్రయాణ ఖర్చులను వారే భరించాల్సి ఉంటుంది. మరి మోహన్ బాబు ప్రస్తావించిన విమానంలో టికెట్ చార్జి ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Updated Date - 2020-06-02T04:24:16+05:30 IST