యూఏఈలో ఒకే రోజు 85 కొత్త కేసులు !
ABN, First Publish Date - 2020-03-26T20:18:31+05:30
యూఏఈలో బుధవారం ఒక్క రోజే 85 కరోనావైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి.
యూఏఈ: యూఏఈలో బుధవారం ఒక్క రోజే 85 కరోనావైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు యూఏఈలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 333కి చేరింది. యూఏఈలోని ఆరోగ్య శాఖ అధికారిక ప్రతినిధి డా. ఫరీదా అల్ హోసాని మాట్లాడుతూ ఐదుగురు బంగ్లాదేశీయులు, ఇద్దరు పాకిస్తానీయులతో సహా ఏడుగురు పూర్తిగా కోలుకున్నారని చెప్పారు. ఇక యూఏఈలో ఈ మహమ్మారి బారిన పడినవారిలో 20 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు గలవారేనని హోసాని తెలిపారు. యూఏఈ ఈ మహమ్మారి వ్యాప్తి , నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా దేశ ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించింది. మసీదులు, స్కూల్స్, మాల్స్ అన్నింటిని మూసివేసింది. అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రెండు వారాలపాటు నిలిపివేసింది.
Updated Date - 2020-03-26T20:18:31+05:30 IST