కోలుకుంటున్న కువైట్...
ABN, First Publish Date - 2020-08-09T19:51:08+05:30
మహమ్మారి కరోనా వైరస్ నుంచి కువైట్ క్రమంగా కోలుకుంటోంది.
కువైట్ సిటీ: మహమ్మారి కరోనా వైరస్ నుంచి కువైట్ క్రమంగా కోలుకుంటోంది. అంతకంతకు రికవరీలు పెరుగుతున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా 472 కొత్త కేసులు నమోదు కాగా... 476 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు కోవిడ్ బారిన పడ్డ వారు 71,199 మంది అయితే... మొత్తం రివకరీలు 62,806 అయ్యాయి. ఇక నిన్న సంభవించిన మూడు కొత్త మరణాలతో కలిపి ఇప్పటివరకు కువైట్ వ్యాప్తంగా 474 మంది ఈ వైరస్కు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 7,919 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే... ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ఇప్పటికే 7.29 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. కోటి 98 లక్షల మందికి ప్రబలింది.
Updated Date - 2020-08-09T19:51:08+05:30 IST