అమెరికాలో ప్రమాదవశాత్తు భారత సంతతి యువకుడి మృతి!
ABN, First Publish Date - 2020-08-09T02:17:48+05:30
ముగ్గురు పిల్లలను కాపాడే ప్రయత్నంలో.. ఓ భారత సంతతి యువకుడు మరణించిన ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలిఫో
వాషింగ్టన్: ముగ్గురు పిల్లలను కాపాడే ప్రయత్నంలో.. ఓ భారత సంతతి యువకుడు మరణించిన ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాలోని కింగ్స్ నది సమీపంలో ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలు.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. పిల్లలు నీటిలో కొట్టుకుపోవడాన్ని గమనించిన 29ఏళ్ల మంజీత్ సింగ్ (భారత సంతతి యువకుడు).. నదిలోకి దూకి వారిని ఒడ్డుకు చేర్చాడు. ఈ క్రమంలో మంజీత్ సింగ్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి.. ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు.. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందం.. నదిలోంచి మంజీత్ సింగ్ మృతదేహాన్ని వెలికి తీసింది. ఇదిలా ఉంటే.. నదిలో ప్రమాదవశాత్తు పడిన పిల్లలకు.. మంజీత్ సింగ్కు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తెలిపారు. పిల్లలను కాపాడాలనే ఉద్దేశంతోనే నదిలోకి దూకి.. ప్రమాదవశాత్తు మరణించినట్లు వెల్లడించారు.
Updated Date - 2020-08-09T02:17:48+05:30 IST