ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవనం నుంచి కిందపడి.. షార్జాలో కేరళ వాసి మృతి!

ABN, First Publish Date - 2020-08-03T17:42:45+05:30

షార్జాలో భవనంపై నుంచి కిందపడి.. ఓ భారతీయుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఎలక్ట్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: షార్జాలో భవనంపై నుంచి కిందపడి.. ఓ భారతీయుడు  మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఎలక్ట్రికల్ ఇంజినీర్ సుమేష్ (24).. పని కోసం గత ఏడాది షార్జాకు వెళ్లాడు. అక్కడ డిజైనర్‌గా పని చేస్తూ.. కొంత మందితో కలిసి, అల్ ధైద్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో జూలై 31న ఫోన్ మాట్లాడేందుకు గది నుంచి బయటికి వెళ్లిన సుమేష్.. భవనం ఆరో అంతస్తు నుంచి కిందపడి మరణించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరుకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సుమేష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా.. గత కొద్ది రోజులుగా సుమేష్.. వ్యక్తిగత సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుమేష్ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డాడా లేదా.. ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-08-03T17:42:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising