దేశానికి తిరిగొచ్చే వారి విషయంలో యూఏఈ కీలక నిర్ణయం !
ABN, First Publish Date - 2020-08-14T15:06:47+05:30
ఇతర దేశాల నుంచి తమ దేశానికి తిరిగొచ్చే వారి విషయంలో యూఏఈ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
యూఏఈ: ఇతర దేశాల నుంచి తమ దేశానికి తిరిగొచ్చే వారి విషయంలో యూఏఈ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూఏఈకి తిరిగొచ్చే ప్రతి ఒక్కరికీ 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్(ఐసీఏ) ఒక ప్రకటన విడుదల చేసింది. విదేశాల నుంచి తిరిగొచ్చే వారందరూ తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. మహమ్మారి కరోనా వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా, తక్కువ రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే కొందరు ప్రొఫెషనల్స్కు మాత్రం పరిస్థితులను బట్టి క్వారంటైన్ గడువును వారం రోజులుగా నిర్ధారించింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Updated Date - 2020-08-14T15:06:47+05:30 IST