ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరుకున్న 10.5లక్షల మంది భారతీయులు!

ABN, First Publish Date - 2020-08-15T21:11:35+05:30

కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘వందే భారత్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘వందే భారత్ మిషన్’లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 10.5లక్షల మంది భారతీయులు ఇండియాకు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ప్రకటించారు. ఆగస్ట్ 11 నాటికే సుమారు 10లక్షల మంది భారతీయులు స్వదేశానికి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఆగస్ట్‌ చివరి నాటికి దాదాపు 500 అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ను మే 7న ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. ఆగస్ట్ 1 నుంచి ఐదో విడత ‘వందే భారత్ మిషన్’ కొనసాగుతోంది.  


Updated Date - 2020-08-15T21:11:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising