ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనిషి నమ్మకాలే మనసుకు పునాది

ABN, First Publish Date - 2020-09-24T08:17:58+05:30

‘‘మనిషి గెలుపు ఓటములు మనసు నమ్మకాలను బట్టే ఉంటాయి. గెలుస్తాననే భావన ఉన్నవాడు విజేత అవుతాడు. ఓడిపోతాననే భావన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మన్‌ కే హారే హార్‌ హై, మన్‌ కే జీతే జీత్‌

కహే కబీర్‌ హరి పాయియే మన్‌హీకే పరితీత్‌


‘‘మనిషి గెలుపు ఓటములు మనసు నమ్మకాలను బట్టే ఉంటాయి. గెలుస్తాననే భావన ఉన్నవాడు విజేత అవుతాడు. ఓడిపోతాననే భావన ఉంటే పరాజితుడవుతాడు. అదేవిధంగా మనసులో ఏర్పడిన దృఢమైన విశ్వాసంతో మాత్రమే పరమాత్మను పొందడం సాధ్యమవుతుంది’’ అంటాడు మహాత్మా కబీరు.

మనసు.. మనిషి నియంత్రణలో ఉన్నప్పుడే దృఢమైన సానుకూల నమ్మకాలు సాకారరూపం దాల్చి సత్ఫలితాలు వస్తాయి. అందుకే మనిషి మనసును, దాని ఆలోచనా విధానాన్ని ప్రాచీనకాలంలో మన రుషులు అనేక కోణాల్లో పరిశీలించి.. శరీరాన్నంతటినీ నియంత్రించే సామర్థ్యం కేవలం మనసుకు మాత్రమే ఉందని తేల్చారు. మనసులో ఏర్పరుచుకున్న నమ్మకాలతోనే మన పురాణ పురుషులెందరో మంచి ఫలితాలు పొందిన సంఘటనలు మన పురాణేతిహాసాల్లో కోకొల్లలు.


రామాయణంలో ఆంజనేయుడు రాముణ్నే మనసారా నమ్మి, రామనామాన్ని ఉచ్చరిస్తూ.. సాగరాన్ని అలవోకగా లంఘించి లంకకు చేరుతాడు. సీతమ్మ జాడ తెలుసుకునే క్రమంలో రాక్షసుల గర్వాన్ని అణిచి క్షేమంగా తిరిగి కిష్కింధ చేరుతాడు. జానకీ మాత సందేశాన్ని శ్రీరామచంద్రునికి అందిస్తాడు.


కృష్ణ పరమాత్మను నమ్మిన కారణంగానే పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను విజయవంతంగా పూర్తి చేసుకొని కురుక్షేత్రంలో గెలిచి రాజ్యాన్ని ఏలగలిగారు. అదే కౌరవులు, కృష్ణుణ్ని పరమాత్మగా నమ్మకపోవడం వల్లే ఆయన్ని బంధించ ప్రయత్నించి అభాసుపాలయ్యారు. యుద్ధంలో ఓడిపోయి చరిత్రహీనులుగా మిగిలిపోయారు. అల్పాయుష్కుడైన మార్కండేయుడు గట్టి నమ్మకంతో పరమ శివుణ్ని ఆశ్రయించి మృత్యువుని జయించడమే గాక దీర్ఘాయుష్కుడై గొప్ప తపస్సంపన్నుడయ్యాడు.




మనిషిని, మనసు నమ్మకాలను కేంద్రంగా చేసుకొనే బుద్ధుడు బౌద్ధ ధర్మాలను రూపొందించాడని చెబుతారు. రామునికి ఎంగిలి పండ్లు తినిపించిన శబరి.. శ్రీరాముని దర్శనానికై నమ్మకంతో ఓపికను కూడగట్టుకొని పదమూడేళ్లు ఎదురుచూసి, చివరకు ఆయన్ని దర్శించి ధన్యురాలైంది. ఇలా ఎన్నో గాథలు నేటి యువతకూ ఆదర్శాలు. ఆధునిక వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా.. చేసే పనిపై నమ్మకం ఉండి, చిత్తశుద్ధితో కృషి చేస్తే కోరుకున్న ప్రతి లక్ష్యాన్నీ సాధించవచ్చంటారు.

- పరికిపండ్ల సారంగపాణి, 9849630290


Updated Date - 2020-09-24T08:17:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising