ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిటికెన వేలిపై గోవర్ధనగిరి

ABN, First Publish Date - 2020-07-19T05:30:00+05:30

ప్రతి సంవత్సరం బృందావనంలోని ప్రజలందరూ సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని ఇంద్రుడిని ప్రార్థించేవారు. ప్రత్యేక పూజలు చేసేవారు. ఒక ఏడాది కృష్ణుడు ధర్మం గురించి, దాని ప్రాధాన్యం గురించి గ్రామస్థులకు వివరించాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి సంవత్సరం బృందావనంలోని ప్రజలందరూ సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని ఇంద్రుడిని ప్రార్థించేవారు. ప్రత్యేక పూజలు చేసేవారు. ఒక ఏడాది కృష్ణుడు ధర్మం గురించి, దాని ప్రాధాన్యం గురించి గ్రామస్థులకు వివరించాడు. చిత్తశుద్ధితో, కష్టపడి పనిచేయాలని, ప్రతి ఒక్కరూ విధిగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించాడు. కృష్ణుడు చెప్పిన దానికి అందరూ సరేనన్నారు. వారు ఆ ఏడాది ఇంద్రుడికి ఎలాంటి పూజలూ నిర్వహించలేదు. దాంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. బృందావనంపై భారీ వర్షం కురిపించాడు. వరద నీటితో గ్రామస్థులందరూ భయపడిపోయారు. ఎక్కడ తలదాచుకోవాలో అర్థం కాలేదు. అప్పుడు కృష్ణుడు తన చిటికెన వేలుపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. ఆ పర్వతం కిందకు గ్రామస్థులందరూ చేరి తలదాచుకున్నారు. దాంతో ఇంద్రుడు తన తప్పు తెలుసుకొని వర్షాన్ని ఆపాడు.


Updated Date - 2020-07-19T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising