ఇంట్లోనే జెండా పండుగ
ABN, First Publish Date - 2020-08-15T05:30:00+05:30
స్కూల్ ఉంటే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. జాతీయజెండా చేతబూని నినాదాలు చేసేవారు. కరోనా మూలంగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితేనేం...
స్కూల్ ఉంటే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. జాతీయజెండా చేతబూని నినాదాలు చేసేవారు. కరోనా మూలంగా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయితేనేం... ఇంట్లోనే ఆనందంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకొందాం.
- ఈరోజు మనం 74వ స్యాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్నాం. అంటే మనకు స్వాతంత్య్రం సిద్ధించి 73 ఏళ్లు పూర్తయ్యాయి.
- బయటకు వెళ్లి ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొనే అవకాశం లేదు కాబట్టి ఇంట్లోనే ఉండి టీవీలో ఎర్రకోటపై ప్రధాని జాతీయజెండా ఎగురవేసే కార్యక్రమాన్ని వీక్షించండి.
- భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత ఆగస్టు 15న జవహర్లాల్ నెహ్రూ ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేశారు. అప్పటి నుంచి భారత ప్రధానమంత్రి ఎర్రకోటపై జాతీయజెండా ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది.
- మన జాతీయ గీతం జనగణమన... ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు.
- ఆగస్టు15న మనతో పాటు స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్న దేశాలు మరికొన్ని ఉన్నాయి. దక్షిణ కొరియా, కాంగో, లిచెన్స్టీన్
- దేశాలకు ఈ రోజునే స్వాతంత్య్రం లభించింది.
- జాతీయ పతాకంలో మూడు రంగులు, మధ్యలో ఆశోకచక్రం ఉంటుంది. పింగళి వెంకయ్య మన జాతీయ జెండా రూపకర్త.
- జాతీయ పతాకాన్ని తయారుచేయడానికి నిర్ధిష్టమైన కొలతలు ఉపయోగించాలి. ఆశోకచక్రంలో 24 పుల్లలు తప్పనిసరిగా ఉండాలి.
Updated Date - 2020-08-15T05:30:00+05:30 IST