ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్ఞానభారతిలో వెయ్యి కోట్లతో యోగా వర్సిటీ

ABN, First Publish Date - 2020-09-14T08:18:13+05:30

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలల ప్రాజెక్టు బెంగళూరును వరించింది. బెంగళూరు విశ్వవిద్యాలయంలోని జ్ఞానభారతి ప్రాంగణంలో రూ.వెయ్యి కోట్లతో యోగా యూనివర్సిటీ ఏర్పాటు కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలల ప్రాజెక్టు బెంగళూరును వరించింది. బెంగళూరు విశ్వవిద్యాలయంలోని జ్ఞానభారతి ప్రాంగణంలో రూ.వెయ్యి కోట్లతో యోగా యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ప్రధానమంత్రి కార్యాలయం సూచనల మేరకు యోగా యూనివర్సిటీ నిర్మాణాలకు యూజీసీ సిద్ధమైంది.


జ్ఞానభారతి క్యాంప్‌సలో 15 ఎకరాల విస్తీర్ణంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుందని బెంగళూరు విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ కేఆర్‌.వేణుగోపాల్‌ శనివారం ప్రకటించారు. యోగా యూనివర్సిటీ ఏర్పాటుకు వివిధ రాష్ట్రాలు ఆసక్తి చూపాయి. అందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చాయి.


బెంగళూరులోని జిగణిలో ఉన్న యోగా కేంద్రం కూడా 10 ఎకరాలు కేటాయించేందుకు ముందుకు వచ్చింది. కానీ పీఎంఓ మాత్రం బెంగళూరు యూనివర్సిటీ క్యాంప్‌సలోని జ్ఞానభారతిలో ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసింది. క్యాంప్‌సలోని 15 ఎకరాలను యూజీసీకి 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వనున్నట్టు వీసీ తెలిపారు. పర్యావరణం, జీవవైవిధ్య సంరక్షణ లక్ష్యంగా యూనివర్సిటీ ఏర్పాటు కానుందన్నారు.


Updated Date - 2020-09-14T08:18:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising