ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధానితో చర్చించాకే లాక్‌డౌన్ పొడగింపుపై తుది నిర్ణయం : యడియూరప్ప

ABN, First Publish Date - 2020-04-10T00:14:26+05:30

ప్రస్తుత్త పరిస్థితి దృష్ట్యా లాక్‌డౌన్‌ను పొడగించేందుకే కేబినెట్ మంత్రులు ముక్తకంఠంతో అభిప్రాయపడుతున్నారని కర్నాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : ప్రస్తుత్త పరిస్థితి దృష్ట్యా లాక్‌డౌన్‌ను పొడగించేందుకే కేబినెట్ మంత్రులు ముక్తకంఠంతో అభిప్రాయపడుతున్నారని కర్నాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప తెలిపారు. అయితే తుది నిర్ణయం మాత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సంప్రదించిన తర్వాతే తీసుకుంటామని ఆయన గురువారం తెలిపారు. తాను కూడా అదే నిర్ణయాన్ని కేబినెట్ ముందు ఉంచానని ఆయన అన్నారు. కేబినెట్ సమావేశం తర్వాత ఆయన వివరాలను వెల్లడించారు.


మరోవైపు హాట్‌స్పాట్ కేంద్రాల్లో కరోనా వైరస్‌ను ఎలా అరికట్టాలన్న దానిపై ఓ నిపుణుల బృందం తమ రిపోర్టును యడియూరప్పకు సమర్పించింది. మే 31 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యా సంస్థలు ప్రారంభించకూడదని, అలాగే రవాణా రంగాన్ని కూడా అనుమతించవద్దని, అయితే ప్రైవేటు వాహనాలను మాత్రం సరి-బేసి సంఖ్యలో అనుమతించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. 

Updated Date - 2020-04-10T00:14:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising