కరోనాతో ప్రముఖ రచయిత మృతి
ABN, First Publish Date - 2020-05-20T00:55:12+05:30
కరోనా మహమ్మారికి ప్రముఖ మరాఠీ రచయిత రత్నాకర్ మట్కారీ బలయ్యారు.
ముంబై: కరోనా మహమ్మారికి ప్రముఖ మరాఠీ రచయిత రత్నాకర్ మట్కారీ బలయ్యారు. 81ఏళ్ల రత్నాకర్ కరోనాతో మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. మరాఠీలో చిన్నపిల్లల కోసం ఎన్నో రచనలు చేసిన ఆయన.. జాతీయ అవార్డు పొందిన దర్శకుడు, నిర్మాత. ముంబైలోని భోయివాడా స్మశాన వాటికలో సోమవారం నాడు ఆయన అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తన రచనాకాలంలో చిన్న పిల్లల కోసం 39 నాటికలు, 20 కథల పుస్తకాలు, 13 నవలలు, 16 నాటకాలను రత్నాకర్ రచించారు.
Updated Date - 2020-05-20T00:55:12+05:30 IST