కిలో బంగారంతో ఉడాయించిన కార్మికుడు
ABN, First Publish Date - 2020-07-02T13:54:17+05:30
కోయంబత్తూర్లో కిలో బంగారంతో ఉడాయించిన కార్మికుడిని పోలీసులు గాలిస్తున్నారు. కోవై ఆర్ఎస్ పురం సుక్రవార్పేటలో శివకుమార్ అనే వ్యక్తి నగల దుకాణం
చెన్నై: కోయంబత్తూర్లో కిలో బంగారంతో ఉడాయించిన కార్మికుడిని పోలీసులు గాలిస్తున్నారు. కోవై ఆర్ఎస్ పురం సుక్రవార్పేటలో శివకుమార్ అనే వ్యక్తి నగల దుకాణం నడుపుతున్నాడు. ఆ దుకాణంలో విరుదునగర్కు చెందిన ప్రభు (30) పనిచేస్తున్నాడు. ఆభరణాల తయారీకి ఆర్డరుపై కాంచీపురం వందడుగుల రోడ్డులో ఉన్న నగల దుకాణానికి ముడి బంగారాన్ని తీసుకెళ్లిన ప్రభు ఎంతసేపటికి రాకపోవడంతో అనుమానించిన శివకుమార్ రత్నపురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు, పరారైన ప్రభు కోసం గాలస్తున్నారు.
Updated Date - 2020-07-02T13:54:17+05:30 IST