యూపీలో మరో నిర్భయ.. కదులుతున్న బస్సులో గ్యాంగ్రేప్
ABN, First Publish Date - 2020-09-28T07:05:05+05:30
రోడ్డు మీద కదులుతున్న బస్సు.. అందులో యువతిపై ముష్కరుల దారుణకాండ. ఇష్టంవచ్చినట్లు కొడుతూ.. పైశాచికానందం పొందుతూ కొనసాగిన ఘోర అత్యాచారకాండ!! 2012లో ఢిల్లీలో నిర్భయ ఘటనను తలపిస్తూ మరో ఘోరం జరిగింది! మహిళలపై నేరాలకు పాల్పడిన వారి ఫొటోలను గోడలపై అతికిస్తామని ఇటీవల ప్రకటించిన యూపీలోనే ఈ ఘటన చోటు చేసుకుంది...
- కండక్టర్, డ్రైవరే దుర్మార్గులు
- మహిళకు మత్తు కలిపిన కూల్డ్రింక్
- రాత్రి నుంచి తెల్లవారేదాకా దారుణకాండ
- మరో ఘటనలో యువతిపై అత్యాచారం
- నాలుక కత్తిరించిన నలుగురు ముష్కరులు
- చావు బతుకుల మధ్య బాధితురాలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 27: రోడ్డు మీద కదులుతున్న బస్సు.. అందులో యువతిపై ముష్కరుల దారుణకాండ. ఇష్టంవచ్చినట్లు కొడుతూ.. పైశాచికానందం పొందుతూ కొనసాగిన ఘోర అత్యాచారకాండ!! 2012లో ఢిల్లీలో నిర్భయ ఘటనను తలపిస్తూ మరో ఘోరం జరిగింది! మహిళలపై నేరాలకు పాల్పడిన వారి ఫొటోలను గోడలపై అతికిస్తామని ఇటీవల ప్రకటించిన యూపీలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో దుండగులు మహిళపై రాత్రంతా పలుమార్లు అత్యాచారం చేసి, తెల్లవారుజామున బస్సులోంచి ఆమెను తోసేశారు. ఈ ఘోరానికి పాల్పడింది విధుల్లో ఉన్న డ్రైవర్, కండక్టరే కావడమే దిగ్ర్భాంతికరం. బాధితురాలి స్వస్థలం మీరట్ జిల్లా సర్ధనా పట్టణం. శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లేందుకు భైసాలి బస్టా్పలో ఆమె బస్సు ఎక్కింది. కొద్దిసేపటికి బస్సులోని కొద్దిమంది దిగిపోయారు.
ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపిన డ్రైవర్, కండక్టర్ ఆమెకు మత్తుమం దు కలిపిన కూల్డ్రింక్ను ఆఫర్ చేశారు. అది తాగిన కొద్దిసేపటికే ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవార్లూ తమ దాష్టీకాన్ని కొనసాగించారు. శనివారం తెల్లవారుజామున మీరట్లో ఓ చోట ఒళ్లంతా గాయాలతో స్పృహకోల్పోయిన స్థితిలో బాధితురాలిని పోలీసులు గుర్తించా రు. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు సాగుతోంది. ఈ నెలలో ఇలాంటి ఘటన యూపీలో మూడోది. కాగా, యూపీలోనే జరిగిన మరో ఘటనలో 19 ఏళ్ల యువతిపై నలుగురు అత్యాచారం చేశారు. అంతటితో ఆగక ఆమె నాలుకను పదునైన ఆయుధంతో కోసి నరకం చూపారు. ప్రస్తుతం అలీగఢ్లోని ఆస్పత్రిలో ఆమె చావుబతుకుల్లో కొట్టుమిట్లాడుతోంది. బాధితురాలు హాత్ర్స అనే ప్రాంతానికి చెందిన యువతి. తల్లితో కలిసి పొలానికి వెళ్లి కనిపించకుండా పోయింది. సందీప్, రాము, లవ్కుశ్, రవి అనే యువకులను నిందితులుగా గుర్తించారు.
Updated Date - 2020-09-28T07:05:05+05:30 IST