మాజీ సీఎం సతీమణి కోవిడ్-19తో మృతి
ABN, First Publish Date - 2020-12-29T15:32:35+05:30
హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం శాంత కుమార్ సతీమణి సంతోష్ శైలజ కోవిడ్-19 కారణంగా కన్నుమూశారు. ఇవాళ తెల్లవారు ..
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం శాంత కుమార్ సతీమణి సంతోష్ శైలజ కోవిడ్-19 కారణంగా కన్నుమూశారు. ఇవాళ తెల్లవారు జామున ఆమె మృతిచెందినట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజీవ్ శైలజ వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం ఆమెకు కరోనా ఇన్ఫెక్షన్ సోకడంతో కాంగ్రా జిల్లా టాండాలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మరోవైపు శనివారం శాంత కుమార్ కూడా కరోనా పాజిటివ్తో ఆస్పత్రిలో చేరారు. ఆయనతో పాటు నలుగురు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత కార్యదర్శి, సెక్యురిటీ అధికారి, డ్రైవర్కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నేపథ్యంలో కుమార్ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆయనతో ఫోన్లో మాట్లాడారు.
Updated Date - 2020-12-29T15:32:35+05:30 IST