మెట్రో రైళ్లకు అనుమతివ్వాలని పశ్చిమ బెంగాల్ సీఎస్కు లేఖ
ABN, First Publish Date - 2020-07-01T00:11:15+05:30
పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం కోల్కత్తాలో మెట్రో రైళ్లకు పరిమిత సంఖ్యలో...
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం కోల్కత్తాలో మెట్రో రైళ్లకు పరిమిత సంఖ్యలో అనుమతివ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ సిన్హా కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్రం సడలింపునివ్వాలని ఆయన లేఖలో కోరారు. జూలై 31 వరకూ కేంద్రం ‘అన్లాక్ 2’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘అన్లాక్ 2’ మార్గదర్శకాల్లో భాగంగా.. దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లను జూలై 31 వరకూ కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం విదితమే.
Updated Date - 2020-07-01T00:11:15+05:30 IST