ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్టుకు ఉరి వేసుకొని బీజేపీ బూత్ అధ్యక్షుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-07-30T12:38:18+05:30

బీజేపీ బూత్ అధ్యక్షుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): బీజేపీ బూత్ అధ్యక్షుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా రాంనగర్ ప్రాంతంలో వెలుగుచూసింది. రాంనగర్ బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుడు పూర్ణచంద్ర దాస్(44) అతని ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్ణచంద్రదాస్ ను తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆ పార్టీ కార్యకర్తలు ఒత్తిడి తీసుకువచ్చారని, దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేతలు ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పూర్ణచంద్ర సిద్ధంగా లేరని, వారి ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపించారు. కాగా బీజేపీ ఆరోపణలు అవాస్తవాలని తృణమూల్ కాంగ్రెస్ నేతలు కొట్టివేశారు. ఈ ఆత్మహత్య ఘటనపై తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. గత నెలలో సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే దేబంద్రనాథ్ రాయ్ కూడా అనుమానాస్పద స్థితిలో  ఆత్మహత్య చేసుకున్నాడు. 

Updated Date - 2020-07-30T12:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising