ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయోధ్య ప్రత్యామ్నాయ స్థలానికి ఓకే

ABN, First Publish Date - 2020-02-22T08:37:13+05:30

అయోధ్యలో బాబ్రీ మసీదు స్థలానికి ప్రతిగా వేరేచోట ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల భూమిని తీసుకోవడం తమకు సమ్మతమేనని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  యూపీ సున్నీ వక్ఫ్‌ బోర్డు అంగీకారం 

లఖ్‌నవూ, ఫిబ్రవరి 21: అయోధ్యలో  బాబ్రీ మసీదు స్థలానికి ప్రతిగా వేరేచోట ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల భూమిని తీసుకోవడం తమకు సమ్మతమేనని యూపీ సున్నీ వక్ఫ్‌ బోర్డు ప్రకటించింది. వివాదాస్పద స్థలం రాముడికే చెందుతుందంటూ నవంబరు 9న తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు అదే సమయంలో ముస్లిం కక్షిదారులకు (సున్నీ వక్ఫ్‌ బోర్డుకు) ఐదెకరాల భూమిని ఇవ్వాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఈ బోర్డుకు అయోధ్యకు 18 కిలోమీటర్ల దూరంలో లక్నో హైవేపై ఉన్న ధనిపూర్‌ అనే గ్రామం వద్ద ఆ భూమిని కేటాయించింది. దీనిని తిరస్కరించాలని కొన్ని ముస్లిం సంస్థలు, పర్సనల్‌ లా బోర్డు సున్నీలను కోరాయి. అయితే సున్నీ బోర్డు అందుకు అంగీకరించలేదు. ‘‘ఈ భూమిని తిరస్కరించలేం. దీనిని తీసుకోవడం మినహా మాకు మరో మార్గం లేదు. తీసుకోకుంటే  అది కోర్టు ధిక్కార నేరం కిందకు వస్తుంది. మా వైఖరిలో మార్పులేదు. ఆ ఐదెకరాలూ ఎలా వినియోగించుకోవాలన్నది సోమవారం జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయించుకుంటాం’’ అని సున్నీ బోర్డు నేత ఫరూకీ తెలిపారు. 

Updated Date - 2020-02-22T08:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising