కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం, ఏడుగురు మృతి
ABN, First Publish Date - 2020-07-06T00:00:13+05:30
లక్నో: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో ఏడుగురు చనిపోయారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ మోదీనగర్ బఖ్కా గ్రామంలోని కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో ఏడుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. అగ్నిప్రమాదంతో పాటు పేలుడు కూడా జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి కర్మాగార భవనం కూలిపోయింది. ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Updated Date - 2020-07-06T00:00:13+05:30 IST