ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరాఖండ్ మంత్రి, 17 మంది సిబ్బందికి కరోనా...హోం క్వారంటైన్‌లో సీఎం

ABN, First Publish Date - 2020-06-01T13:41:14+05:30

ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్, అతని భార్య అమృతా రావత్, మరో 17 మంది కుటుంబసభ్యులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్, అతని భార్య అమృతా రావత్, మరో 17 మంది కుటుంబసభ్యులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మంత్రి తోపాటు అతని కుటుంబసభ్యులను డెహ్రాడూన్ నగరంలోని సొంత ఇంట్లో క్వారంటైన్ చేశారు. మంత్రి ఇంట్లో పనిచేస్తున్న 17 మంది సిబ్బంది, కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకడంతో వారిని క్వారంటైన్ కు తరలించారు. కరోనా సోకిన మంత్రి సత్పాల్ మహారాజ్ శుక్రవారం ఉత్తరాఖండ్ సీఎం త్రివేండ్ర సింగ్ రావత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో సీఎం త్రివేండ్రసింగ్ రావత్ తోపాటు మంత్రులందరినీ హోంక్వారంటైన్ చేసినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి జేసీ పాండే చెప్పారు. మంత్రి దంపతులతోపాటు అతని ఇద్దరు కుమారులు, వారి భార్యలు, ఆరునెలల వయసున్న మనవడికి కూడా కరోనా వైరస్ సోకింది. మంత్రి భార్య అమృతరావత్ కు కొవిడ్-19 పాజిటివ్ రావడంతో ఆమెను రిషికేష్ లోని ఎయిమ్స్ కు తరలించామని మంత్రి ఓఎస్డీ అభిషేక్ శర్మ చెప్పారు. 

Updated Date - 2020-06-01T13:41:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising