అమెరికా ఉపాధ్యక్షుల చర్చ.. ‘ఈగ’ రచ్చ..!
ABN, First Publish Date - 2020-10-09T13:56:56+05:30
అమెరికా ఉపాధ్యక్షుల చర్చలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుల చర్చలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే... ఉపాధ్యక్ష చర్చలో ఓ ఈగ ప్రత్యక్షమైంది. మైక్ పెన్స్ తలపై వాలి అక్కడే 2 నిమిషాలు ఉండటంతో అందరి కళ్లూ దానిపై పడ్డాయి. చీమ కూడా దూరని విధంగా ఏర్పాట్లు జరిగినా ఈగ చొరబడటంతో చర్చలో ఈగే గెలిచిందంటూ నెటిజన్లు ఎడాపెడా పోస్టులు పెట్టేశారు. ఈగ క్వారంటైన్కు వెళ్లాలంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఓ నెటిజన్ ‘మైక్పెన్స్ ఫ్లై’ పేరిట తెరిచిన ట్విటర్ ఖాతాకు నిమిషాల్లోనే 60 వేల మంది ఫాలోవర్లు అయ్యారు.
Updated Date - 2020-10-09T13:56:56+05:30 IST